Header Banner

వరుణ్ చక్రవర్తికి బీసీసీఐ షాక్! తప్పు చేయాలంటే భయపడేలా..

  Thu May 08, 2025 16:51        Sports

కేకేఆర్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి భారత క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. మళ్లీ తప్పు చేయాలంటే భయపడేలా చేసింది. అసలు వరుణ్ చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం.

 

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 2 వికెట్ల తేడాతో క్లోజ్ ఫైట్‌లో ఓడిపోయింది కేకేఆర్. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆడాల్సిన 2 మ్యాచుల్లోనూ నెగ్గినా ప్లేఆఫ్స్ చేరాలంటే ఇతర జట్ల గెలుపోటముల మీద ఆధారపడక తప్పదు. ఇలాంటి సిచ్యువేషన్‌లో రహానె సేనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి బిగ్ షాక్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు. అతడికి 25 శాతం ఫైన్ వేసింది. అసలు వరుణ్ చేసిన తప్పేంటి.. అనేది ఇప్పుడు చూద్దాం.

 

తప్పేంటి..

లెవల్ 1 నేరం కింద ఆర్టికల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనే కారణంతో వరుణ్ చక్రవర్తిపై 25 శాతం జరిమానా విధించింది బీసీసీఐ. అలాగే అతడికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా వేసింది. చెన్నైతో మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రేవిస్‌‌ను ఔట్ చేశాడు వరుణ్. 25 బంతుల్లో 52 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రేవిస్ జోరును చూసి కేకేఆర్ భయపడసాగింది. ఈ తరుణంలో అతడ్ని ఔట్ చేసిన వరుణ్.. క్రీజును వదిలేసి వెళ్లిపొమ్మంటూ చేతితో సంజ్ఞ చేశాడు. దీంతో ఫైన్ విధించారు. అయితే మ్యాచ్ రిఫరీ ఎదుట వరుణ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, బ్యాటర్ ఔట్ అయినప్పుడు అతడి వైపు ఏ ప్లేయర్ అయినా ఉపయోగించే భాష లేదా సంజ్ఞలకు సంబంధించినదే ఆర్టికల్ 2.5. జెంటిల్మన్ గేమ్‌లో ఇలాంటి వాటికి చోటు లేదని.. అసభ్యకర, ఓవర్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్‌కు అడ్డుకట్ట వేయాల్సిందేనని కొందరు నెటిజన్స్ అంటున్నారు. బీసీసీఐ నిర్ణయం భేష్ అని.. తప్పు చేయాలంటే భయపడేలా ఫైన్ వేయడం, డీమెరిట్ పాయింట్‌తో మందలించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VarunChakravarthy #BCCI #TeamIndiaSelection #CricketControversy #BCCIUpdate